వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తో రాజీ యత్నాల వార్తలను కొట్టేసిన ఎఐసిసి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో సయోధ్య యత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి) వర్గాలు ఖండించాయి. పార్లమెంటు సభ్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ వైయస్ జగన్ తో చర్చలు జరిపిన విషయానికి ఆ వర్గాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సందీప్ దీక్షిత్ డిప్యూటీ చీఫ్ విప్ కాబట్టి పార్లమెంటు సభ్యులు ఆయనను కలుస్తుంటారని, వైయస్ జగన్ కూడా అలాగే కలిసి ఉంటారని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.

సందీప్ దీక్షిత్ తో వైయస్ జగన్ భేటీపై మాట్లాడేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మాట్లాడేందుకు నిరాకరించారు. జగన్ ఓదార్పు యాత్రపై గానీ జగన్ వ్యవహారంపై గానీ మాట్లాడేందుకు కాంగ్రెసు వర్గాలు ఇష్టపడడం లేదు. సందీప్ దీక్షిత్ ను తాను కలిసిన విషయాన్ని వైయస్ జగన్ కూడా ధ్రువీకరించారు. అయితే తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్, సందీప్ దీక్షిత్ ఒకే కారులో పార్లమెంటు నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో వారిద్దరి మధ్య సయోధ్య చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X