హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాజశేఖర రెడ్డి భూలావాదేవీలపై డిఎల్, జెసి పరోక్ష దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదారబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన ఎపిఐసిసి భూలావాదేవీలపై అధికార కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎపిఐఐసిలో దాదాపు పది వేల కోట్ల రూపాయల విలువ చేసే 530 ఎకరాల కుంభకోణం జరిగిందని వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. రైతులు అంగలారుస్తుంటే ఆ విషయాన్ని తాము మీడియా ముందుకు తెస్తున్నామని వారు చెప్పారు. ఆ భూములను ఎవరెవరు స్వాధీనం చేసుకున్నారో రైతులు చెబుతున్నారని వారు చెప్పారు. వారి పేర్లను వెల్లడించడానికి డిఎల్ రవీంద్రా రెడ్డి నిరాకరించారు. ఎంఆర్ ప్రాపర్టీస్ అనే సంస్థకు విలువైన భూములను కేటాయించి ఎపిఐసిసిని నీరు గార్చారని ఆయన అన్నారు.

ఎపిఐఐసి కొద్ది మంది జేబు సంస్థగా మారిందని ఆయన విమర్శించారు. 2004 నుంచి ఎపిఐసిసి లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎపిఐసిసి వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, పూర్తిగా దివాళా తీసిందని ఆయన అన్నారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కు అప్పగించిన భూముల విషయంలో ఎపిఐసిసి వాటాను పూర్తిగా తగ్గించేశారని ఆయన అన్నారు. నానక్ రాం గూడాలో పెద్ద యెత్తున భూకుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎపిఐసిసి వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారని ఆయన అన్నారు. ఈ భూముల వ్యవహారంపై గతంలో తమ పార్టీ దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి కూడా పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ భూముల వ్యవహారంలో ఎవరెవరు లాభపడ్డారో బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X