వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ అధిష్టానంతో సయోధ్య చర్చల వార్తలు ఉత్తవే: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్ఠానానికీ, తనకూ మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ పార్లమెంటు సభ్యులు కొందరు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు, ఉభయ పక్షాలతోనూ చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను కాంగ్రెసు కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్‌ జగన్ తోసిపుచ్చారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సహచర ఎంపీగా కాంగ్రెసు విప్‌ సందీప్‌ దీక్షిత్‌ తో తాను మాట్లాడుతుంటానని, అంతేగాకుండా పార్లమెంటు భవనంలో తమ బల్లలు పక్కపక్కనే ఉంటాయని తెలిపారు.

సయోధ్య కోసం సందీప్‌ తనతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలపై స్పందిస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. అధిష్టానానికి, తనకూ మధ్య సందీప్‌ ఎందుకు చర్చలు జరుపుతారని, అసలు ఏ హోదాలో ఆయన వీటిని సాగిస్తారని ప్రశ్నించారు. మీడియా ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తోందో తనకు అర్థం కావడం లేదని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X