ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో సాక్షి డైలీ ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
ఖమ్మం: అసంబద్ధ వార్తలు ప్రచురిస్తున్నారంటూ కొత్తగూడెంలో సాక్షి దినపత్రిక ప్రతులను సీపీఐ కార్యకర్తలు గురువారం తగలబెట్టారు. బయ్యారం గనుల అక్రమాలను నిరిసిస్తూ ప్రధాన రహదారుల్లో కార్యకర్తలు రాకపోకలను అడ్డుకున్నారు. బయ్యారం గనుల లీజులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న ఆందోళనలో భాగంగా సిపిఐ కార్యకర్తలు ఆ పనికి ఒడిగట్టారు. సాక్షి డైలీలో అసత్యమైన వార్తాకథనాలు ప్రచురిస్తున్నారని సిపిఐ కార్యకర్తలు ఆరోపించారు.

కాగా, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం, భద్రచాలం, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. మానవహారాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేశారు. అజీజ్ పాషా, పశ్య పద్మ, గుండా మల్లేష్ తదితరులను పోలీసులు వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయకపోతే జిల్లా బంద్ కు పిలుపునిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X