ఖమ్మం జిల్లాలో సాక్షి డైలీ ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ
కాగా, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం, భద్రచాలం, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. మానవహారాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేశారు. అజీజ్ పాషా, పశ్య పద్మ, గుండా మల్లేష్ తదితరులను పోలీసులు వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. బయ్యారం గనుల లీజును రద్దు చేయకపోతే జిల్లా బంద్ కు పిలుపునిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు.
Comments
Story first published: Thursday, August 12, 2010, 13:48 [IST]