హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలకు ఒయు జెఎసి హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ (ఒయు జెఎసి) నాయకులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులకు అల్టిమేటం జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీ లోపల తెలుగుదేశం టిడిపి శాసనసభ్యులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకపోతే సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో గురువారం నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పే కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల్లో గెలిచిన 12 మంది శాసనసభ్యులను కూడా వారు సత్కరించారు.

విద్యార్ధులపై కేసుల ఎత్తివేత తమ చేతుల్లో లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం పేర్కొనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనలో తెలంగాణ వస్తుంది, విద్యార్ధులపై కేసులు ఎత్తివేస్తామని చెప్పిన చిదంబరం ఇప్పుడు మాట మార్చడం సబబు కాదని విద్యార్ధి నాయకులు అన్నారు. మాటపై నిలకడలేని ఈ ప్రభుత్వం మాటలను ఇక ముందు ఎలా నమ్ముతామని వారు ప్రశ్నించారు. చిదంబరం వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇక తెలంగాణ రాదుస, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయడం జరగదని స్పష్టమైందన్నారు. ఏమి జరిగినా బయపడేది లేదని, విద్యార్ధులపై కేసులు ఎత్తివేసి, ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు ఉద్యమం చేస్తామని వారు స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X