హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ సీమాంధ్ర నేతల వ్యాఖ్యలపై కాంగ్రెసు తెలంగాణ నేతల చర్చ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana map
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం జాతి ద్రోహమని సీమాంధ్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై చర్చించేందుకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు శనివారం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అనుసరించాల్సిన కార్యక్రమంపై కూడా వారు శాసనసభ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో చర్చించారు. సీమాంధ్ర మంత్రుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారిపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తారా, మరే విధమైన కార్యక్రమం ప్రకటిస్తారనేది ఇప్పటి వరకు తేలలేదు.

తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెసు తెలంగాణ నాయకులు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారం, తెలంగాణ భూముల కేటాయింపులు వంటి పలు అంశాలపై కూడా వారు చర్చించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X