వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే దౌర్జన్యం: అర్థరాత్రి ఆర్డీఎస్ రివర్స్ స్లూయిజ్ ధ్వంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

 Mahaboob Nagar
మహబూబ్ నగర్: మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో అర్థరాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. శుక్రవారం అర్థరాత్రి తన అనుచరులతో కలిసి వచ్చి ఆయన రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) రివర్స్ స్లూయిజ్ ను ధ్వంసం చేశారు. ఆ తూముల ధ్వంసం వల్ల ప్రాజెక్టు ఎప్పుడూ నిండే అవకాశం లేదు. కింది నీళ్లు తెరిపి లేకుండా పారుతూనే ఉంటాయి. అక్రమంగా నీళ్లను వాడుకోవడానికి బాలనాగిరెడ్డి ఆ పనికి పూనుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన నీరు రాదు.

బాలనాగిరెడ్డి చర్యను తెలంగాణ తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. గతంలో కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతంలో దాడికి దిగారు. బాలనాగిరెడ్డి చర్యపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వర్గాలు మండిపడుతున్నాయి. బాలనాగిరెడ్డి గుండాగిరికి పాల్పపడ్డారని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు విమర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాలనాగిరెడ్డి చర్యపై తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X