హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాపూజీపై కార్యక్రమం మీద ఎన్టీవిపై తెలంగాణవాదుల మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఇటీవల ఎన్టీవి ప్రసారం చేసిన నా వార్తలు నా ఇష్టం కథనం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేదిగా ఉందని తెలంగాణవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపూజీని ఓ తెలంగాణ వ్యక్తి ఒరే, తురే అన్నట్లుగా ఆ కార్యక్రమం ప్రసారమైంది. బాపూజీ ఎవరో తెలియనట్లుగా కూడా చిత్రీకరించారు. పోచయ్య అనే యానిమేటెడ్ క్యారెక్టర్ ను సృష్టించి తెలంగాణవాదులు భారత జాతి వ్యతిరేకులని చూపించేందుకు ఎన్టీవి ప్రయత్నించిందని ఆరోపిస్తున్నారు. తమది తెలంగాణజాతి అని, భరత జాతి అంటే తమకు తెలియదని తెలంగాణవాదులు భావిస్తున్నట్లు ఆ టీవీ చూపించే ప్రయత్న చేసింది.

తెలంగాణ పట్ల ఎన్టీవి తన గుడ్డి వ్యతిరేకతను ప్రదర్సించిందని, అహంకార ధోరణిని ప్రదర్శించిందని తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ వ్యాఖ్యానించింది. భారత జాతికి తెలంగాణవాదులు వ్యతిరేకులని, వారు అజ్ఞానులని చూపించేందుకు ప్రయత్నించినట్లు వ్యాఖ్యానించింది. ఎన్టీవి ప్రసారం చేసిన ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ రాజ్ న్యూస్ తన వ్యాఖ్యానాలను జోడించింది. అదే అంధ్ర క్యారెక్టర్లు సన్యాసిరావు, కుల్లప్పల చేత మాత్రం చాలా గౌరవంగా మాట్లాడించారని ఆరోపించింది. ఎన్టీవి తెలంగాణ వ్యతిరేకతపై తెలంగాణవాదులు మండిపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X