హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాసిరెడ్డి పద్మ ప్లేటు ఫిరాయింపు: చిరు పెద్దన్నయట

By Pratap
|
Google Oneindia TeluguNews

Vasireddy Padma
హైదరాబాద్: తాను పార్టీ క్రమశిక్షణా సంఘానికి రాసిన లేఖపై ప్రజారాజ్యం పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ప్లేటు ఫిరాయించారు. తనకు పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పెద్దన్నయ్యలాంటివాడని ఆమె వ్యాఖ్యానించారు. తాను పార్టీ క్రమశిక్షణా సంఘానికి రాసిన లేఖ నిజమేనని, అయితే దాన్ని వెంటనే ఉప సంహరించుకున్నానని, అది చర్చనీయాంశం కాదని భావించానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ లేఖను తాను పదిరోజుల క్రితం రాశానని, అది ఇప్పుడు ఎందుకు బయటపడిందో తెలియడం లేదని, అది ముగిసిన కథ అని అనుకున్నానని ఆమె అన్నారు.

తనకు ప్రజారాజ్యం రాజకీయంగా పుట్టినిల్లులాంటిదని, చిరంజీవి నీడ కింద తాను రాజకీయంగా ముందుకు వచ్చానని ఆమె చెప్పుకున్నారు. సమస్యలు, చర్చనీయాంశాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా కుటుంబ సభ్యుల మధ్య మాట్లాడుకునే విషయాలని తాను భావించానని, వాటిని బజారుకీడ్చాలని గానీ రచ్చ చేయాలని గానీ తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. తాను ఒకే విషయం మీద లేఖ రాశానని, చిరంజీవి వద్ద ఎంతో ప్రజాస్వామ్యం ఉందని ఆమె అన్నారు. తాను పార్టీ మీదనో, చిరంజీవి మీదనో యుద్ధం ప్రకటించడం లేదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X