వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీని వీడిన సరే: వైయస్ జగన్ కు ప్రణబ్ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కోల్ కత్తా: ఓదార్పు యాత్రపై కాంగ్రెసు అధిష్టానం మరోసారి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు హెచ్చరికలు జారీ చేసింది. ఓదార్పు యాత్రకు అనుమతించేది లేదని కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ శనివారం కోల్ కత్తాలో చెప్పారు. "ఓదార్పు యాత్ర వద్దని జగన్‌కు స్పష్టంగా చెప్పాం. ఒక వ్యక్తి గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను బుజ్జగించే ప్రసక్తే లేదు. జగన్ పార్టీలో ఉంటే ఎంత? లేకపోతే ఎంత?" అని ప్రణబ్ వ్యాఖ్యానించారు.

ఓదార్పు యాత్రకు అనుమతి సాధించుకోవడానికి జగన్ ఇటీవల ఢిల్లీలో రెండు సార్లు ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ప్రస్తుత పద్ధతిలో ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చేది లేదని ప్రణబ్ ఆయనకు స్పష్టం చేసినట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. జగన్ పై ప్రణబ్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుత స్థితి చూస్తుంటే జగన్ పై కొరడా ఝళిపించేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X