హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాపై భూకబ్జా చేస్తున్నారని బురద చల్లుతున్నారు: కాకా

By Pratap
|
Google Oneindia TeluguNews

G Venkatswamy
హైదరాబాద్‌: తాను భూ కబ్జా చేశాననడం సరికాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి అన్నారు. తమ భూమిలో నిర్మాణం చేస్తుంటే ఆపానని తెలిపారు. ఆ భూమిపై తనకు సంబంధం లేదని యాదయ్య అధికారుల ముందు చెప్పారని అన్నారు. తనను అపఖ్యాతి పాలు చేసేందుకే కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

కాంగ్రెస్‌ నేత వెంకటస్వామికి తాను ఎలాంటి భూమిని అమ్మలేదని యాదయ్య తెలిపారు. తాను శ్రీనివాస్‌గౌడ్‌కు భూమిని అమ్మితే, అతడి నుంచి సినీనటుడు శ్రీకాంత్‌ సోదరుడు అనిల్‌ కొన్నారని యాదయ్య స్పష్టం చేశారు. కాకా, వినోద్‌ అతితక్కువ ధరకు భూమిని ఇవ్వాలంటూ అడిగారని, ఇవ్వనందుకు తన దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసుకొని వేధించారని యాదయ్య చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X