హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకా బెదిరిస్తున్నారు, ఆ భూమి మాదే: శ్రీకాంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikanth
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) తమను బెదిరిస్తున్నారని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం శివరాం పల్లిలోని భూమి తమదేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన మరదలికి చెందిన ఆ భూమిని కబ్జా చేసేందుకు కాకా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూముల్లో జెండాలు పాతడం ఇప్పటి వరకు తాను సినిమాల్లో మాత్రమే చూశానని, ఇప్పుడు నిజ జీవితంలో చూస్తున్నానని ఆయన అన్నారు. భూమి కొనే ముందు తనకు ఎందుకు చెప్పలేదని కాకా ప్రశ్నించారని ఆయన చెప్పారు. భూమి పత్రాలను తాము కాకాకు చూపించామని ఆయన చెప్పారు. ఆ భామి తమదేనని చెప్పడానికి స్థానికులే సాక్ష్యమని ఆయన అన్నారు.

తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేయించేందుకు కాకా మనుషులు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కాకా కుమారుడు వినోద్ సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కూడా తమకు మద్దతుగా ఉందని ఆయన చెప్పారు. తానెప్పుడూ వివాదాల్లో తలదూర్చలేదని ఆయన స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు శత్రువులెవరూ లేరని ఆయన అన్నారు. కాకా భూమి పక్కనే తాను భూమి కొనడమే తప్పయి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిలో డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు కొత్త వివాదాన్ని తెర మీదికి తెస్తున్నారని, తాను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిరూపిస్తే భూమిని వదిలేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య, గవర్నర్ నరసింహన్ లను కలిసి ఈ విషయాన్ని వివరిస్తానని ఆయన అన్నారు. భూవిక్రేతలతో కూడా శ్రీకాంత్ మీడియా ప్రతినిధులతో మాట్లాడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X