తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత పులి
ఇంతకు ముందు ప్రయాణికులపై చిరుత దాడి చేయడంతో చిరుతలను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక చిరుత చిక్కిన తర్వాత ప్రయాణికులకు బెడద తప్పిందని భావించారు. అయితే మళ్లీ దాడి చేయడంతో మరో చిరుత ఉందని గుర్తించి మళ్లీ బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మరో చిరుత బోనులోకి వచ్చి పడింది. దీంతో కాలి బాటన ప్రయాణికులకు చిరుతల బెడద తప్పినట్లే భావిస్తున్నారు.
జింకల పార్కు ఉన్నంత వరకు అక్కడ చిరుతల సంచరిస్తుంటాయని అటవీ శాఖ డిఎఫ్ఓ రవిశంకర్ అంటున్నారు. ఆ బోనును అట్లాగే ఉంచుతామని చెప్పారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో 20 దాకా చిరుతలు ఉండవచ్చునని ఆయన అన్నారు. కాగా, చిత్తూరు జిల్లాలోని మిట్టపల్లి వద్ద వెంకటేష్ అనే రైతు గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. మూడు గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి.
Comments
Story first published: Monday, August 23, 2010, 9:23 [IST]