హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తారలు జ్యోతి, సైరాభానులను వదిలేసిన పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jyothi
హైదరాబాద్: హైదరాబాదులోని కుందన్ బాగ్ వ్యభిచార గృహంలో పట్టుబడిన తారలు జ్యోతి, సైరాభానులను పోలీసులు వదిలేశారు. వ్యభిచార గృహ నిర్వాహకులను, విదేశీ మహిళను హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. వ్యభిచార గృహ నిర్వాహకుల్లో రాజమండ్రికి చెందిన మహిళ నీలమణి, జువ్వాది రాజు, వీరభద్రయ్య, రవిచంద్, మూర్తి ఉన్నారు. విదేశీ మహిళ సబ్రీనాను కూడా పోలీసులు వదిలిపెట్టలేదు. ఆమె వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో వదిలేయలేదని తెలుస్తోంది. ఎవరైనా పూచీ పడితే ఆమెను వదిలేసే అవకాశం ఉంది.

వ్యభిచార గృహంలో పట్టుబడిన సైరాభాను టిక్ టిక్ టిక్, బొమ్మరిల్లు, ఆ రోజే, వందకోట్లు సినిమాల్లో నటించింది. మరో సహాయ నటి జ్యోతి ఎవరి గోల వారిదే, హంగామా, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించింది. వీరిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారమంతా వారిని విచారించినట్లు సమాచారం. మంత్రులు, విఐపిలు ఉండే ప్రాంతంలో ఈ సెక్స్ రాకెట్ బయటపడింది. విటులు బడా పారిశ్రామికవేత్తలేనని అంటున్నారు. రోజుకు రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారని కూడా తెలుస్తోంది.

వ్యభిచార గృహంపై పోలీసులు నిఘా పెట్టి దాడి చేశారు. పోలీసులు విటుల రూపంలో వ్యభిచార గృహంలోకి వెళ్లారు. ఆ రకంగా నిర్వాహకులను, తారలను వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సైరాభాను, జ్యోతిలకు సెక్స్ రాకెట్ లో పాత్ర లేదని, వారు వచ్చిపోవడం మాత్రమే చేశారని, అందువల్ల వారిపై సాక్ష్యాలు లేవని, అందువల్ల వదిలిపెట్టామని పోలీసులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X