హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2011కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు: గుత్తా సుఖేందర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: 2011కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, వచ్చే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నిర్వహించుకుంటామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వాన్ని అధికారికంగా జరిపితే మంచిదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వపరంగా జరిపితే మంచిదని మంత్రులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు కోరినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పరంగా జరపడం వల్ల నష్టం, ఇబ్బంది ఏమీ లేదని ఆయన అన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో తాను పాల్గొనబోనని ఆయన చెప్పారు. ఓదార్పు యాత్ర విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచిదని ఆయన అన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవం విషయంలో గత సంప్రదాయాన్నే పాటిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడం బాధాకరమని కాంగ్రెసు సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ స్టేట్ లో ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల్లోని ప్రాంతాల్లో విమోచన దినోత్సవాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17వ తేదీన అధికారికంగా జరుపుతున్నాయని, అదే పద్ధతిని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆయన విడిగా సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోవద్దని ఆయన సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X