హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకుంటాం: నాయని నర్సింహారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nayani Narasimha Reddy
హైదరాబాద్: హైదరాబాదులోని ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు నాయని నర్సింహారెడ్డి హెచ్చరించారు. ఎట్టి పరిస్థితిలో కూడా వైయస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించనీయబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మాజీ ముఖ్యమంత్రిలు చాలా మంది ఉండగా వైయస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి అంజయ్య మూడు సార్లు ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచారని, పైగా తెలంగాణకు చెందినవారని, అంజయ్య విగ్రహం స్థాపించకుండా ఎక్కడో కడప జిల్లాలో పుట్టిన వైయస్సార్ విగ్రహాన్ని నెలకొల్పడం సమంజసం కాదని ఆయన అన్నారు. వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపన ప్రయత్నానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, పెద్ద యెత్తున ఆందోళన చేస్తామని, అన్ని పార్టీల అభిప్రాయాలను కూడగడుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X