వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై చర్యకు కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం చర్చ

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ క్రమశిక్షణ చర్యల సంఘం శనివారం రాత్రి సమావేశమైంది. సంఘం ఛైర్మన్‌ ఎ.కె.ఆంటోనీ, మెంబర్‌ సెక్రటరీ మోతీలాల్‌ వోరాలు పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలపై సమీక్షించారు. అధిష్ఠానం హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వచ్చేనెల 3న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే వీరు భేటీ అయినట్టు సమాచారం. సమావేశంలో ఏం నిర్ణయించారన్న విషయాన్ని వెల్లడించేందుకు వోరా నిరాకరించారు. కొన్ని అంశాలపై చర్చించామని మాత్రమే వోరా అన్నారు.

జగన్ పై ఆషామాషీగా కాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే క్రమశిక్షణా సంఘం భేటీ జరిగినట్లు సమాచారం. పార్టీ నియమావళి ప్రకారం జగన్ పై చర్యలు తీసుకోవాలనేది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ, అంబటి రాంబాబులపైనే కాకుండా ఇతర పార్టీ నాయకులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X