హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ బయ్యారం గనులను అల్లుడికి కట్టబెట్టారు: చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: లక్షల కోట్ల రూపాయల విలువ చేసే బయ్యారం గనులను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన అల్లుడు అనిల్ కుమార్ కు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. బయ్యారం గనుల విషయంలో ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. బయ్యారం అక్రమాలపై సోమవారం తెలుగుదేశం చేపట్టిన ధర్నా నిమిత్తం ఖమ్మం జిల్లాకు బయల్దేరి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

బయ్యారం గనుల ద్వారా దళారులు, అధికారంలో ఉన్నవారి కుటుంబసభ్యులు మాత్రమే లబ్ధి పొందుతున్నారని అన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నచోట అక్రమ మైనింగ్‌ను అడ్డుకుంటామని రాహుల్‌ ఉపన్యాసాలు చేస్తున్నారు గానీ మన రాష్ట్రంలోని అక్రమ మైనింగ్‌పై సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. గనుల అక్రమాలను తెలుసుకునేందుకే ఖమ్మం పర్యటన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తెచ్చి న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X