వైయస్ జగన్ కు మరో షాక్: వారిద్దరు ఓదార్పునకు దూరం

ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ప్రసన్న, బాలనాగిరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలంటూ స్పీకర్ కిరణ్కుమార్రెడ్డిని తెలుగుదేశం పార్టీ కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ జాప్యం చేస్తున్నారని, దీనిపై ఒక దిశానిర్దేశం చేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం వేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. తెలుగుదేశం వ్యూహం గురిం చి తెలుసుకున్న నల్లపురెడ్డి దీనిని ఎదుర్కోవడానికి న్యాయవాదులను సంప్రదించారు. వారు కూడా వేరే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే వేటు తప్పదని తెలిపారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు వీరు యాత్రకు దూరం గా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications