హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ తో అనుబంధం, ఆత్మీయత గొప్పది: సిఎం రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధం, ఆత్మీయత చాలా గొప్పదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. వైఎస్‌ వర్దంతి కార్యక్రమాలకు వెళ్లాలని వున్నా ఆరోగ్యరీత్యా హాజరు కాలేకపొతున్నానని తెలిపారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకున్నారు. వైయస్ స్మృతి నిత్య నూతమని ఆయన అన్నారు. వైయస్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఆయన అన్నారు.

వైయస్ మరణం ఊహించలేని పరిణామమని ఆయన అన్నారు. భౌతికంగా మన ముందు లేకపోయినా వైయస్ ఆత్మ మన చుట్టే ఉంటుందని ఆయన అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వైయస్ మనతో ఉంటారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైయస్ రాజశేఖర రెడ్డి నిత్యం ప్రజల గురించి ఆలోచించేవారని ఆయన అన్నారు. ఎవరొచ్చి అడిగినా లేదని చెప్పడం వైయస్ చేత కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X