హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీకి డిఎస్: వైయస్ జగన్ పై హై కమాండ్ చర్య మీద ఉత్కంఠ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ హుటాహుటిన శుక్రవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాయబారం బెడిసి కొట్టి, తమను ధిక్కరిస్తూ ఓదార్పు యాత్ర చేపట్టిన నేపథ్యంలో డిఎస్ పయనానికి ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలిగా సోనియా గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని గురువారం సాయంత్రమే డిఎస్ హైదరాబాదు వచ్చారు. తిరిగి శుక్రవారం ఉదయమే ఆయన ఢిల్లీకి బయలుదేరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయనకు ఢిల్లీ నుంచి పిలువు వచ్చినట్లు చెబుతున్నారు. జగన్ పై చర్య తీసుకునే విషయంపై చర్చించడానికే డిఎస్ ను పిలిపించినట్లు చెబుతున్నారు.

వీరప్ప మొయిలీని పక్కన పెట్టి సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ నేరుగా జగన్ వ్యవహారాలను చూస్తున్నారు. దీంతో డిఎస్ అహ్మద్ పటేల్ తో చర్చలు జరిపి జగన్ పట్ల అనుసరించాల్సిన వ్యూహాన్ని, ఆయనపై తీసుకునే చర్యల పద్ధతిని చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఏడాది కాలంగా జగన్ చర్యలను సహిస్తూ వస్తున్నామని, ఇక ఏ మాత్రం సహించకూడదని సోనియా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X