ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పుకు పోటెత్తిన జనం: ఇద్దరు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమైంది. షెడ్యూలు ప్రకారం ఆయన ఉదయం గిద్దలూరులో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించవలసి ఉంది. అయితే అనేక చోట్ల ఆగాల్సిరావటంతో ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు గిద్దలూరు చేరుకున్నారు. అక్కడ భారీసంఖ్యలో జనం వీధుల్లోను, ఇళ్ల మీద ఆయనను చూసేందుకు చేరారు. భవంతుల మీద ప్రజలు ఎక్కి జగన్ కోసం నిరీక్షించారు.

వైయస్ జగన్ ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. జగన్ ఓదార్పు యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ లాడ్జి భవనం మీద కరెంట్ షాక్ తగలడంతో ఇద్దరు మృతి చెందారు. ఆ భవనంపై 200 మంది దాకా ఉన్నారు. వారిలో మరో ఆరుగురు గాయపడ్డారు. కరెంట్ షాక్ నుంచి తప్పించుకునేందుకు ఒక్కసారిగా భవనంపై నుంచి దూకారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X