హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రూప్ వన్ పై ముఖ్యమంత్రి రోశయ్యకు మధు యాష్కీ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్‌: ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను ఈ నెల 5వ తేదీన నిర్వహించాలనే పట్టుదలను నిరసిస్తూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ ముఖ్యమంత్రి రోశయ్యను హెచ్చరించారు. ముఖ్యమంత్రి రోశయ్యకు డిజిపి, డిఎస్పీలు కావాలో ప్రజాప్రతినిధులు కావాలో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాల్సిందేనని ఆయన అన్నారు. తమ తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ సహించబోమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సొంత పార్టీనైనా ఎదిరిస్తామని ఆయన అన్నారు.

తెలంగాణ విద్యార్థులతో పాటు తాము రేపటి బంద్ లో పాల్గొంటామని, విద్యార్థులతో పాటు నడుస్తామని ఆయన అన్నారు. తూటాలనైనా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఉద్యమంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. పరీక్ష నిర్వహించాలనుకుంటే పరిణామాలకు మరో విధంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాలనుకోవడం సీమాంధ్ర నేతల కుట్ర మరో కాంగ్రెసు ఎంపి వివేక్ అన్నారు. ఉద్యమంలో పాల్గొనడం వల్ల తమ ప్రాంత విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ కాలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X