గ్రూప్ వన్ పై ముఖ్యమంత్రి రోశయ్యకు మధు యాష్కీ హెచ్చరిక
తెలంగాణ విద్యార్థులతో పాటు తాము రేపటి బంద్ లో పాల్గొంటామని, విద్యార్థులతో పాటు నడుస్తామని ఆయన అన్నారు. తూటాలనైనా ఎదుర్కుంటామని ఆయన అన్నారు. ఉద్యమంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులందరూ పాల్గొంటారని ఆయన చెప్పారు. పరీక్ష నిర్వహించాలనుకుంటే పరిణామాలకు మరో విధంగా ఉంటాయని ఆయన అన్నారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాలనుకోవడం సీమాంధ్ర నేతల కుట్ర మరో కాంగ్రెసు ఎంపి వివేక్ అన్నారు. ఉద్యమంలో పాల్గొనడం వల్ల తమ ప్రాంత విద్యార్థులు పరీక్షకు ప్రిపేర్ కాలేదని ఆయన అన్నారు.
Comments
మధు యాష్కీ కాంగ్రెసు ఎంపి ఎపిపిఎస్సీ గ్రూప్ 1 తెలంగాణ హైదరాబాద్ madhu yaskhi congress mp appsc group 1 telangana hyderabad
Story first published: Saturday, September 4, 2010, 14:14 [IST]