హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లీక్ కాలేదని నమ్మించేందుకు వెంకట్రామి రెడ్డి యత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkatarami Reddy
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం బిఇడి కళాశాల పరీక్ష కేంద్రంలో గ్రూప్ వన్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కాలేదని నమ్మించేందుకు ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న పత్రాలు పరీక్ష ప్రారంభమైన అర గంటలోపలే బయటకు వచ్చాయి. అ ప్రశ్న పత్రాలు టీవీ చానెళ్లలో దర్శనమిచ్చాయి. ఓయూ బీఈడీ కళాశాల ఘటనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో పరీక్ష రద్దు చేయలేదన్నారు. ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరించారు. పరీక్షల నిర్వహణలో అవాంతరాలు ఏర్పడిన చోట మరో వారం రోజుల్లో తిరిగి పరీక్ష నిర్వహిస్తామని ఎపిపిఎస్సీ వర్గాలంటున్నాయి.

కాగా, ఓయూ బీఈడీ కేంద్రంలో గ్రూప్‌ వన్‌ పరీక్ష పూర్తిగా రద్దయినట్లేనని ఉస్మానియా విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాల ప్రిన్నిపల్‌ అయోధ్య తెలిపారు. ఉదయం 10.40 నిమిషాల వరకు పరీక్ష సజావుగానే జరిగిందని, ఆ తర్వాత భవనం దక్షిణ ప్రాంతం నుంచి 100 మంది పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారని, వీరు అద్దాలు పగులగొట్టి ప్రశ్నాపత్రాలు ఎత్తుకొని పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను ఏపీపీఎస్సీకి పంపిస్తామని అయోధ్య చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X