వైయస్ జగన్ ముందు రామోజీ, బాబు దూదిపింజలు: అంబటి రాంబాబు
చంద్రబాబు కాంగ్రెసులో పుట్టి పెరిగి తెలుగుదేశం పార్టీలో చేరి మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, వైయస్ ప్రజాసేవలో తరించారని, వైయస్ చేతిలో చంద్రబాబు తుక్కుతుక్కుగా ఓడిపోయారని ఆయన అన్నారు. వైయస్ ను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. వైయస్ ను యోగి, మహానుభావుడిగా ఆయన అభివర్ణించారు. వైయస్ విగ్రహాల ప్రతిష్టాపనకు అధికారులు కల్పిస్తున్న అడ్డంకులపై ఆయన తీవ్ర ఆక్షేపణ తెలిపారు. గుంటూరు జిల్లా చీరాలలో, నెల్లూరులో వైయస్ విగ్రహానికి ఏర్పడిన అడ్డంకులను ఆయన ఉదహరించారు. వైయస్ విగ్రహ ప్రతిష్టాపనలకు అధికారుల అనుమతి సత్వరమే లభించేలా ముఖ్యమంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. వైయస్ విగ్రహాల స్థాపనకు అధికారులు అడ్డుపడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక అధిపతి రోశయ్య అని, తాత్కాలిక చైర్మన్ అని ఆయన నవ్వుతూ అన్నారు.