వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనైపోయినా ఫర్వాలేదు..ప్రజలు ముఖ్యం: ముషారఫ్‌

By Pratap
|
Google Oneindia TeluguNews

Pervez Musharraf
లండన్: తన వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడినా ఫర్వాలేదని, దేశ వ్యాప్తంగా తనపై మోపిన కేసులకు ఏ మాత్రం బెదరనని, పాకిస్తాన్‌ను దారుణ పరిస్థితులనుంచి గట్టెక్కించడమే తన లక్ష్యమని పాకిస్తాన్‌ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషారఫ్ ప్రకటించారు. కొన్నేళ్లుగా లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ముషారఫ్‌ మీడియాతో మాట్లాడారు.

అలాగే ముషారఫ్‌(67) తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించారు. పాక్‌ ఆధ్యక్ష పదవిని చేపట్టి, దేశ వాసుల్లో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పుతానని ప్రతిన బూనారు. చీకట్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ‌లో వెలుగులు నింపుతానన్నారు. 2013 సంవత్సరంలో జరగనున్న సాధారణ ఎన్నికల నాటికి కొత్త పార్టీని స్థాపిస్తానని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X