హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ది ముగిసింది..చిరంజీవిది మొదలైంది

By Srikanya
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలో పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి యాత్ర మొదలుపెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల వరుస పర్యటనలతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. చిరంజీవి పర్యటన ప్రజారాజ్యం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహం తెచ్చింది. జూలైలో సోంపేట ఘటనను నిరసిస్తూ చిరంజీవి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు అదే ప్రాంతం నుంచి ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించడం విశేషం. సోమవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ వరకు జిల్లాలో ఆయన ప్రజా చైతన్యయాత్ర నిర్వహించనున్నారు.

మండల, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసేలా అధినేత పర్యటన ఉపయోగించుకోవాలని పీఆర్‌ పీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా చిరంజీవిని అభిమానించే యువతను పార్టీ వైపు ఆకర్షించేలా ప్రజా చైతన్యయాత్రను రూపొందించినట్లు వారు చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు పాలవలస కరుణాకర్‌లు ఆదివారం చిరంజీవి పర్యటన షెడ్యూల్‌ ను విడుదల చేశారు. ఇక ఈ రోజు చిరంజీవి హైదరాబాద్ నుంచి నేరుగా ఇచ్ఛాపురం చేరుకోనున్నారు. రాత్రికి ఇచ్ఛాపురంలోనే బస చేస్తారు. మంగళవారం ఇచ్ఛాపురంలో ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించి కవిటి, కాశీబుగ్గ, కాకరాపల్లి, పోలాకి మీదుగా రాత్రికి శ్రీకాకుళం చేరుకుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X