ప్రియురాలి కోసం తండ్రితో కిడ్నాప్ డ్రామా ఆడిన యాష్ గుప్తా
హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ బంగారం వ్యాపారి కుమారుడు కిడ్నాప్ నకు గురైనట్లు అంతకు ముందు వార్తలు వచ్చాయి. యాష్ గుప్తాను కిడ్నాప్ చేశామంటూ ఆగంతకులు మంగళవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తే యాష్ గుప్తాను వదిలిపెడతామంటూ వారు హెచ్చరించారు. దీంతో యువకుడు యాష్ గుప్తా తండ్రి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, కిడ్నాప్ అయినట్లు యాష్ గుప్తానే డ్రామా ఆడించాడని తేలిపోయింది.
Comments
Story first published: Tuesday, September 14, 2010, 15:01 [IST]