హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంగారం వ్యాపారి కుమారుడి కిడ్నాప్: రూ. 2.5కోట్ల డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో గల ఓ బంగారం వ్యాపారి కుమారుడు కిడ్నాప్ నకు గురయ్యాడు. హేమంత కుమార్ అనే బంగార వ్యాపారి కుమారుడు యాష్ గుప్తాను ఆగంతకులు సోమవారం రాత్రి కిడ్నాప్ చేశారు. యాష్ గుప్తాను కిడ్నాప్ చేశామంటూ ఆగంతకులు మంగళవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తే యాష్ గుప్తాను వదిలిపెడతామంటూ వారు హెచ్చరించారు. దీంతో యువకుడు యాష్ గుప్తా తండ్రి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చార్మినార్ పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ అతను టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చార్మినార్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్సు పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వ్యవహారాన్ని ఛేదించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X