రోశయ్య ప్రభుత్వంపై ప్రజారాజ్యం నేత చిరంజీవి ఘాటైన విమర్సలు
లక్షలకోట్ల కుంభకోణాల్లో ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు. ఏపీఐఐసి కుంభకోణం విషయంలో ఆ కార్యాలయం ముందు తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన భూములను బడా భూస్వాములకు, కావాల్సిన వారికి ధారాదత్తం చేస్తున్నారు. ప్రజల సొమ్మును బడాబాబులకు కట్టబెట్టడంపైనా, మరే ప్రజా సమస్యలపైన, ప్రభుత్వం అవినీతిపై ప్రజారాజ్యం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.
Comments
Story first published: Tuesday, September 14, 2010, 14:52 [IST]