శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య ప్రభుత్వంపై ప్రజారాజ్యం నేత చిరంజీవి ఘాటైన విమర్సలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధిని పక్కనబెట్టి శ్రీకాకుళం జిల్లాను కేవలం ప్రయోగశాలగా మాత్రమే ప్రభుత్వం అభిప్రాయపడుతున్నదని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో పర్యటన నిర్వహిస్తున్నారు. వర్యటనలో ఆయన ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. ప్రతి ప్రాజెక్టును ఇక్కడ పరిశీలించడానికి జిల్లా ప్రయోగశాల కాదని విమర్శించారు. ప్రయోగాలు మాని ఇక్కడి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయటమే తన యాత్ర ముఖ్య లక్ష్యమని అన్నారు.

లక్షలకోట్ల కుంభకోణాల్లో ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు. ఏపీఐఐసి కుంభకోణం విషయంలో ఆ కార్యాలయం ముందు తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన భూములను బడా భూస్వాములకు, కావాల్సిన వారికి ధారాదత్తం చేస్తున్నారు. ప్రజల సొమ్మును బడాబాబులకు కట్టబెట్టడంపైనా, మరే ప్రజా సమస్యలపైన, ప్రభుత్వం అవినీతిపై ప్రజారాజ్యం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X