హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ఆస్తులను హైకమాండ్ తెప్పించుకుంటోంది: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల వివరాలను తమ పార్టీ అధిష్టానమే తెప్పించుకుంటోందని కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్ ఆస్తులు ఐదు వేల కోట్ల రూపాయలు కాదని, ఆ ఆస్తులు 50 లక్షల కోట్ల రూపాయల విలువ చేస్తాయని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ ఎన్నో ఆస్తులు సంపాదించారని ఆయన ఆరోపించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని సంపాదించినవారి గుట్టు కూడా విప్పాలని ఆయన అన్నారు.

ప్రస్తుతం రాష్ట్ర మంత్రులు పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. కొత్త మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా తెలంగాణ పిసిసి ఏర్పాటు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రత్యేక పిసిసి అడగడంలో తప్పు లేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం హై కమాండ్ దేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. అందరూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X