హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీడియాపై ముఖ్యమంత్రి కె. రోశయ్య చురకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మీడియాకు ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చురకలంటించారు. తాను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు కొన్ని పత్రికలు, టీవీ చానెళ్లు వార్తలు ఇచ్చాయని, అలా వస్తే బాగుండని అనుకున్నారమోనని ఆయన అన్నారు. తాను ఇప్పుడు నార్మల్ గానే ఉన్నానని ఆయన అన్నారు. ఎరువుల పంపిణీపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రైతులను అడ్డం పెట్టుకుని ఆందోళనలు చేయవద్దని ఆయన ప్రతిపక్షాలకు సలహా ఇచ్చారు. తాము సకాలంలోనే ఎరువులు పంపిణీ చేశామని, అయితే వివరాలపై ప్రకటన ఇవ్వలేకపోయామని, దాంతో ప్రతిపక్షాలు రాజకీయాలకు ఒడిగట్టాయని ఆయన అన్నారు.

ఈసారి సకాలంలో ఒకేసారి రాష్ట్రమంతా వర్షాలు పడ్డాయని, దీంతో ఒకేసారి రాష్ట్రమంతా ఎరువులకు డిమాండ్ పెరిగిందని, డిమాండ్ కూడా పెరిగిందని, అయినా సకాలంలోనే ఎరువులను అందించామని ఆయన అన్నారు. రాష్టంలో ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఎరువులను సక్రమంగానే సరఫరా చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాది రెండు కోట్ల పది లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 48 వేల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని, వాటిని రాష్టానికే కేటాయించే విధంగా కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన చెప్పారు. ఇంత వరకు రైతులకు సరఫరా చేసిన ఎరువుల వివరాలను కూడా ఆయన మీడియాకు అందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X