చంద్రబాబు నాయుడు చేతిలోకి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి డైలీ?
చంద్రబాబు చేతిలోకి పత్రిక వెళ్లిపోతుండడంతో జర్నలిస్టులు పలువురు రాజీనామాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆ పత్రికలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన జర్నలిస్టులున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో ఏదో మేరకు తెలంగాణ విషయాలకు ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబు చేతిలోకి వెళ్తే ఆ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణకు చెందిన జర్నలిస్టులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ అసిస్టెంట్ ఎడిటర్ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రారంభిస్తున్న తెలంగాణ దినపత్రికలో ఎడిటర్ గా చేరుతున్నట్లు సమాచారం.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ హైదరాబాద్ chandrababu naidu telugudesam andhra jyothi radhakrishna hyderabad
Story first published: Wednesday, September 15, 2010, 14:59 [IST]