హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు నాయుడు చేతిలోకి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి డైలీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణ చేతిలో ఉన్న ఆ పత్రిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేతిలోకి మారుతున్నట్లు సమాచారం. గతంలో రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని కొనుగోలు చేసినప్పుడే చంద్రబాబు బినామీగా ఆయన వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరిగింది. శనివారంనాటికి పూర్తిగా చంద్రబాబు ఆంధ్రజ్యోతిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ మాత్రం రాధాకృష్ణ నడిపించుకుంటారని తెలుస్తోంది.

చంద్రబాబు చేతిలోకి పత్రిక వెళ్లిపోతుండడంతో జర్నలిస్టులు పలువురు రాజీనామాల బాట పట్టినట్లు తెలుస్తోంది. ఆ పత్రికలో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన జర్నలిస్టులున్నారు. ఇప్పటి వరకు ఆంధ్రజ్యోతిలో ఏదో మేరకు తెలంగాణ విషయాలకు ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబు చేతిలోకి వెళ్తే ఆ మాత్రం అవకాశాలు కూడా ఉండవనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో తెలంగాణకు చెందిన జర్నలిస్టులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ అసిస్టెంట్ ఎడిటర్ రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రారంభిస్తున్న తెలంగాణ దినపత్రికలో ఎడిటర్ గా చేరుతున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X