హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మామ రవీంద్రనాథ్ రెడ్డి నిర్వాకం: వైయస్ జగన్ క్రెడిబిలిటికి దెబ్బ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కడప మేయర్, తన మామ రవీంద్రనాథ్ రెడ్డి ఎరువుల అక్రమ రవాణా వ్యవహారం కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ క్రెడిబిలిటీని దెబ్బ తీసే ప్రమాదం ఏర్పడింది. కడప జిల్లా రైతులకు ఉద్దేశించిన యూరియాను రవీంద్రనాథ్ రెడ్డి లారీలు ఇతర రాష్ట్రాలకు లేదా తన కర్మాగారాలకు అక్రమంగా తరలిస్తున్న వైనం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రైతులు తీవ్రమైన ఎరువుల కొరతను ఎదుర్కుంటున్న సమయంలో రవీంద్రనాథ్ రెడ్డి నిర్వాకం బయటపడడం జగన్ ను ఇరకాటంలో పడేసినట్లే భావించాల్సి ఉంటుంది.

వైయస్ జగన్ ఆస్తులపై, ఇతర బాగోతాలపై స్టూడియోఎన్ తెంపు లేకుండా వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమీప బంధువుకు చెందిన స్టూడియోఎన్ పని గట్టుకుని అటువంటి వార్తాకథనాలను వెలుగులోకి తీస్తోంది. రవీంద్రనాథ్ రెడ్డి ఎరువుల అక్రమ రవాణా వ్యవహారాన్ని కూడా స్టూడియోఎన్ వెలుగులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. స్టూడియోఎన్ ప్రతినిధులు సమాచారం అందించడంతో అధికారులు ఆ ఎరువుల లారీలను పట్టుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు, తాజా గురువారం ఈనాడు దినపత్రికలో రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారంపై వార్తాకథనాన్ని ప్రచురించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X