వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయవాదుల ఆందోళనపై తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల మధ్య తేడాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదుల డిమాండ్ పై ఇద్దరు మంత్రులు ప్రాంతాలవారీగా విడిపోయారు. భిన్న వైఖరులను ప్రకటించారు. సీమాంధ్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ న్యాయవాదులను తప్పు పడుతుండగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్థిస్తున్నారు. సమస్య పరిష్కారానికి మంత్రులే రావాలని న్యాయవాదులు అనడం సరి కాదని మోపిదేవి వెంకట రమణ అన్నారు. సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. న్యాయవాదుల తీరు బాగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ న్యాయవాదుల అనమానాలను నివృత్తి చేస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తెలంగాణ న్యాయవాదుల డిమాండ్ సరైందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారికి తన సంఘీభావం తెలుపుతున్నట్లు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. 60 ఏళ్లలో ఒక్కసారి కూడా అడ్వొకేట్ జనరల్ పదవి తెలంగాణవారికి రాలేదనే బాధ అందరిలోనూ ఉందని ఆయన అన్నారు. తెలంగాణవారికి 42 శాతం వాటా కేటాయించాలనే డిమాండ్ న్యాయమైందేనని ఆయన అన్నారు. న్యాయసంబంధమైన పదవుల్లో తెలంగాణవారికి 40 నుంచి 45 శాతం కేటాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X