కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డిపై ఎరువుల కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindranath Reddy
కడప: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మామ, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. ఎరువుల అక్రమ రవాణాకు సంబంధించి ఈ కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన బాలాజీ సంస్థ నుంచి ఎరువులు అక్రమంగా రవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలకు చెందిన కొంత మందిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు.

రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేసే విషయంపై సంబంధిత అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన రవీంద్రనాథ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైతే వైయస్ జగన్ పై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X