ధర్నాలో విద్యార్థినిపై నడుంపై చేయి వేసిన సిఐ మనోహర్ రెడ్డి
ఐతే నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థినిని సిఐ మనోహర్ రెడ్డిని నడుంపై చేయి వేసి నెట్టివేసి, అసభ్య పదజాలంతో దూషించడం ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ మహిళా పోలీసులు ఉన్నప్పటికీ ఆయన అమ్మాయిపై చేయి వేసి నెట్టడాన్ని ఏబివిపి, భాజపాతోపాటు తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉన్నా మనోహర్ రెడ్డి ఆ పనికి ఒడిగట్టాడు. విద్యార్థినిని అదుపు చేయాలనుకుంటే లేడీ కానిస్టేబుల్ కు ఆయన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది.
దీంతో విద్యార్థులు ఈసిఐఎల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. అమ్మాయి పట్ల అమానుషం ప్రవర్తించిన సీఐ మనోహర్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవల్సిందిగా డిమాండ్ చేశారు. సదరు కీచక పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని ఏబివిపి నాయకులు కళ్యాణ్, లక్ష్మణ్ లు డిమాండ్ చేశారు. తమను జెండా సైతం ఎగరవేయనీయలేదన్నారు. విద్యార్థిని పట్ల తనకు ఏ విధమైన దురుద్దేశం లేదని, అనుకోకుండా ఆ సంఘటన జరిగిందని మనోహర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికే పోలీసులు, ప్రభుత్వం ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అధిరారం చేతిలో ఉంది కదాని ప్రభుత్వం తెలంగాణవారిని భయభ్రాంతులకు గురి చేసినా ఎవరూ భయపడరన్నారు. సదరు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని అలా ఐతేనే మరోసారి ఇలాంటి పునకావృతం కావని ఆమె పేర్కొన్నారు.