కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ లో 11 రోజులుగా విద్యుత్ లేక కష్టాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: తెలంగాలోని కరీంనగర్, అదిలాబాద్ తూర్పులోని నాలుగు నియోజకవర్గాల్లో గత 11 రోజులుగా విద్యుత్ లేక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, రామగుండంతో తదితర నాలుగు నియోజకవర్గాలు పూర్తి అంధకారంలో మునిగిపోయాయి. ఎల్లంపల్లిలోని 132 కె.వి. విద్యుత్ స్తంభం కూలి పోవటంతో ఈ సమస్య తలెత్తింది. విద్యుత్ స్తంభం కూలి పోవటంతో 4 నియోజకవర్గాల్లోని 22 మండలాలలోని 900 గ్రామాలు అంధకారంలో మునిగి పోయాయి. అక్కడి 21 బొగ్గు గనుల్లో లే ఆఫ్ ప్రకటించారు. దీంతో 40 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది. పనులు ఆలస్యం అవుతున్నందుల మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

కాగా విద్యుత్ పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో స్థానిక తెరాస ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ పునరుద్ధరణకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. 3 లైన్లు పునరుద్ధరణకు సమయం తీసుకోనుంది. ఐతే అధికారుల నిరాసక్తతకు తోడుగా వర్షం కూడా భారీగా కురుస్తుండటంతో పనులకు ఆటంకం ఎర్పడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X