హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో తిరగనివ్వం: ఆ మంత్రులకు ఒయు జెఎసి హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: తెలంగాణ పార్లమెంటు సభ్యులపై విమర్శలు చేసిన ముగ్గురు మంత్రులపై ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి మండిపడింది. తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్ రెడ్డి, జి. వివేక్ ల తీరుపై మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదరం నరసింహ సోమవారం మంత్రివర్గం సమావేశంలో చేసిన విమర్సలపై ఒయు జెఎసి మంగళవారం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఆ ముగ్గురు మంత్రుల దిష్టిబొమ్మలను ఒయు జెఎసి కార్యకర్తలు దగ్ధం చేశారు. ఆ మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు. మంత్రులపై తెలంగాణ న్యాయవాదుల జెఎసి కూడా తీవ్రంగా మండిపడింది.

కాగా, మంత్రులను కాంగ్రెసు శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి సమర్థించారు. ప్రభుత్వంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఆ నలుగురు పార్లమెంటు సభ్యులు వత్తాసు పలుకుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆ నలుగురు ఎంపిలపై తాము పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X