హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పేరుతో కెసిఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారు: పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తెలంగాణ పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో తెలంగాణ కాంగ్రెసు వారు అందరూ కెసిఆర్ కన్నా ఓ మెట్టు పైనే ఉన్నారన్నారు. తెలంగాణవాదులు పరస్పర కుమ్ములాటలలో కూరుకొని తెలంగాణ వాదాన్ని పలుచన చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణ ఎంపీలందరూ తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని, ఆ మేరకు వారు పోరాడుతున్నారని ఆయన చెప్పారు.

తెలంగాణ మంత్రులే ఎంపీలపై వివాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించగా అది వారి విజ్జతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. ఇంతకుముందు కొందరు కాంగ్రెసు నాయకులు తెలంగాణ అన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ను ముందుకు తీసుకు వచ్చేవారు. కాని ఇప్పుడు వారు నిజాలు తెలుసుకొని తెలంగాణకోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణవాదులు అందరూ ఐక్యతతో పోరాడితే తెలంగాణ రావడం ఖాయమని, అందరూ కలిసి కట్టుగా ఉండి పోరాటం చేయాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X