హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.5.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు: సొంతం చేసుకున్న మియాపూర్ వాసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balapur Laddu
హైదరాబాద్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూ వేలంపాటలో 5.35 లక్షల రూపాయలు పలికింది. గతేడాది కంటే రూ.25వేలు అధికంగా పలికింది. ఈ లడ్డూను మియాపూర్ కు చెందిన కొడాలి శ్రీధర్ బాబు వేలంపాటలో అధిక ధరకు పాట పాడి సొంతం చేసుకున్నారు. శ్రీధర్ స్వంత ఊరు నిజామాబాద్ జిల్లాలోని బోధన్. బాలాపూర్ తో తనకు ఇరవయ్యేళ్ల అనుబంధం ఉందని, లడ్డుని వేలంపాటలో దక్కించుకోవడమే తన చిరకాల వాంఛగా ఉండేదని నేటితో ఆ కోరిక తీరిందని శ్రీధర్ లడ్డు సొంతం చేసుకున్న అనంతరం మాట్లాడుతూ చెప్పారు. కాగా లడ్డుని తను రూ.5.50 లక్షలకు పాడినప్పటికీ తనకు ఇవ్వలేదని గతేడాది లడ్డుని సొంతం చేసుకున్న సరిత వివాదానికి తెరలేపారు. వేలం పాట అనంతరం బాలాపూర్ వినాయకుడు హుసేన్ సాగర్ లో నిమజ్జనానికి బయలు దేరాడు.

ఖైరతాబాద్ వినాయకుడు అతి ఎత్తయినదిగా గాంచినది. అలాగే బాలాపూర్ వినాయకుడు లడ్డు అంతకన్నా ఎక్కువ ప్రఖ్యాతి గాంచినది. పదహారు సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డు వేలంపాటలో సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. మొదటిసారి 1994లో 450 రూపాయలు పలికిన ధర ఆ తరువాతి సంవత్సరం పదిరెట్లు పెరిగి ఏకంగా 4500 రూపాయలు పలికింది. నాటి నుంచి నేటి వరకు అది పెరుగుతూనే ఉంది. 2009లో ఈ లడ్డు 5.10 రూపాయలు పలుకగా ఈ సంవత్సరం 5.35 లక్షలు పలికింది. గతేడాది కంటే రూ.25 వేలు అధికంగా ఈసారి పలికింది. ఐతే 2008లో రూ.2.70 లక్షలకు పలికిన లడ్డు ఇప్పటి వరకు రికార్డుగా నిలిచింది.

గుంటూరులోని నకిరేకల్లు మండలం జేసెవరంలో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది. బాలాపూర్ లడ్డుకంటే అధిక ధర పలకడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి లడ్డును 5.95 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X