రూ.5.35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు: సొంతం చేసుకున్న మియాపూర్ వాసి
ఖైరతాబాద్ వినాయకుడు అతి ఎత్తయినదిగా గాంచినది. అలాగే బాలాపూర్ వినాయకుడు లడ్డు అంతకన్నా ఎక్కువ ప్రఖ్యాతి గాంచినది. పదహారు సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డు వేలంపాటలో సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. మొదటిసారి 1994లో 450 రూపాయలు పలికిన ధర ఆ తరువాతి సంవత్సరం పదిరెట్లు పెరిగి ఏకంగా 4500 రూపాయలు పలికింది. నాటి నుంచి నేటి వరకు అది పెరుగుతూనే ఉంది. 2009లో ఈ లడ్డు 5.10 రూపాయలు పలుకగా ఈ సంవత్సరం 5.35 లక్షలు పలికింది. గతేడాది కంటే రూ.25 వేలు అధికంగా ఈసారి పలికింది. ఐతే 2008లో రూ.2.70 లక్షలకు పలికిన లడ్డు ఇప్పటి వరకు రికార్డుగా నిలిచింది.
గుంటూరులోని నకిరేకల్లు మండలం జేసెవరంలో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది. బాలాపూర్ లడ్డుకంటే అధిక ధర పలకడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి లడ్డును 5.95 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నాడు.
Comments
Story first published: Wednesday, September 22, 2010, 12:42 [IST]