హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు తెలంగాణ దెబ్బ: పరిగి బహిరంగ సభ రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఎదురైన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణవాదులను సవాల్ చేయడానికి తలపెట్టిన రంగారెడ్డి జిల్లా పరిగి బహిరంగ సభను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రద్దు చేసుకున్నారు. తనపై తెలంగాణవాదులు రాళ్లతో దాడి చేసిన ప్రదేశంలోనే బహిరంగ సభ పెట్టి సవాల్ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, ఎయు జెఎసి, తదితర తెలంగాణ ప్రజా సంఘాలు తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు పరిగి సభను అడ్డుకుంటామని చెప్పారు. దాంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఈ నెల 5,6,7 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో పర్యటించి పరిగిలో బహిరంగ సభ నిర్వహించాలని మొదట తలపెట్టారు. తెలంగాణవాదులకు సవాల్ విసురుతూ బహిరంగ సభ నిర్వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సూచించడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఒకరిద్దరు రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులు మాత్రం పరిగి బహిరంగ సభ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, అలా నిర్వహించడం వల్ల తెలంగాణవాదులను రెచ్చగొట్టినట్లవుతుందని, దాని వల్ల లాభం జరగకపోగా నష్టం వాటిల్లుతుందని భావించి బహిరంగ సభ వద్దని చంద్రబాబు సూచించినట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబును అడ్డుకుంటామని ఒయు జెఎసి గానీ రాజకీయ జెఎసి గానీ ప్రకటించలేదు. అయినా చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో పర్యటన జరిపితే మరింత వ్యతిరేకత ఎదురవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో పరిస్థితిని బట్టి తదుపరి పర్యటన చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X