హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొనసాగుతున్న కాంగ్రెసు రగడ: తెలంగాణ ఎంపిలపై మంత్రు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagender
హైదరాబాద్: తెంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు తమపై చేస్తున్న విమర్శలపై వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్‌లు అన్నారు. బుధవారం వారు ముఖ్యమంత్రి రోశయ్యను ఆయన నివాసంలో కలుసుకుని ఎంపీలు చేస్తున్న విమర్శలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఎంపీలపై తాము విమర్శలు చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు తమపై పదే పదే విమర్శలు చేయడం సబబుకాదని మంత్రులు అన్నారు.

కెసిఆర్ కు అనుకూలంగా తెలంగాణ ఎంపిలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, మధు యాష్కీ, వివేక్ వ్యవహరిస్తున్నారంటూ దానం, ముఖేష్ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఫిర్యాదుపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X