హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో ప్రారంభమైన వినాయక నిమజ్జనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganesh Nimajjanam
హైదరాబాద్: బుధవారం ఉదయం నుండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వినాయకుడి నిమజ్జనం సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల్లో ఉదయం వేళల్లో లడ్డు వేలాన్ని ప్రారంభించి అనంతరం గణేశుడిని నిమజ్జనం కోసం తరలించారు. అత్యంత ఎత్తయిన విగ్రహం ఖైరతాబాద్ లోని పంచముఖ గణపతి అందరి మదిని దోచుకుంటుంది. చివరి రోజూ కావటంతో భక్తులు భారీ సంఖ్యలో ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి బారులు తీరారు. ఖైరతాబాద్, ప్రసాద్ మల్టీప్లెక్స్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలు వినాయకుడిని చూడటానికి వస్తోన్న భక్తులతో నిండిపోయాయి. లడ్డు వేలం అనంతరం ఈ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తారు. ఎత్తయిన వినాయకుడిని ప్రతిష్టించడంలో ఖైరతాబాద్ కు పేరు ఉండగా, లడ్డు అధిక ధరకు అమ్ముడు పోయే వినాయకుడిగా బాలాపూర్ సొంతం చేసుకుంది. ఉదయం 10 గంటల వరకే లడ్డు వేలంపాట పూర్తి కావడంతో బాలాపూర్ వినాయకుడు నిమజ్జనానికి తరలాడు. ఆ గణేశుడు చార్మినార్, అఫ్జల్ గంజ్, మొజంజాహి మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ చేకురుంటుంది. ఈసారి హైదరాబాద్ లోని రాంనగర్ లో వినాయకుడికి 585 కిలోల లడ్డును ప్రసాదంగా పెట్టారు. ఎక్కువ బరువుగల ఈ లడ్డు రెండున్నర లక్షల రూపాయలకు పైగా పలికింది.

నగరంలోని పలు ప్రాంతాల నుండి చిన్న చిన్న వినాయకులు ఇప్పటినే నిమజ్జనానికి తరలాయి. భారీ వినాయకులను సైతం తరలిస్తున్నారు. వినాయకిడి నిమజ్జనానికి హూసేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు, దుర్గం చెరువు, కూకట్ పల్లి చెరువు, సఫిల్ గూడ చెరువుల వద్ద భారీగా క్రేన్లు సిద్ధం చేశారు. హుసేన్ సాగర్ వద్ద 65 క్రేన్లు, భారీ విగ్రహాల కోసం మరో 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి 35వేల మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. మరో మూడు బలగాలను రిజర్వులో ఉంచారు. నగరంలో సుమారు 45వేల విగ్రహాలు ఉండవచ్చని అంచనా.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X