వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్ రెడ్డికి క్లాస్ పీకిన ప్రధాని మన్మోహన్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
న్యూఢిల్లీ: కామన్ వెల్త్ క్రీడలకు సంబంధించిన నిర్మాణాలపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి క్లాస్ పీకారు. కామన్వెల్త్ క్రీడల అసమర్థ నిర్వహణపై ఆయన శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో కేంద్రమంత్రులు ఎస్ జైపాల్‌రెడ్డి, ఎంఎస్ గిల్‌లను తీవ్రంగా మందలించారు. క్రీడాసన్నాహకాల్లో ఆలస్యం, క్రీడాగ్రామం, క్రీడాప్రాంగణాల నాసిరకం నిర్మాణం, అపరిశుభ్రత, క్రీడోత్సవాల ప్రధాన వేదిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం దగ్గరలో పాదచారుల వంతెన కూలిపోవడం వంటివాటిని ప్రస్తావిస్తూ జైపాల్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. క్రీడల నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన మంత్రుల బృందానికి జైపాల్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.

కామన్ వెల్త్ క్రీడల ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ప్రధాని క్రీడోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. క్రీడాకారుల గైర్హాజరీ ఆందోళనకర విషయమేనన్నారు. క్రీడోత్సవ సన్నాహకాలపై గురువారం ఎంఎస్ గిల్, జైపాల్‌రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితరులతో ప్రధాని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కామన్వెల్త్ క్రీడల ఆర్గనైజింగ్ కమిటీకి ఆహ్వానం లేకపోవడంపై చౌహాన్ స్పందిస్తూ 'ప్రభుత్వ శాఖల అధిపతులతో ప్రధాని సమావేశమయ్యారు. ఆర్గనైజింగ్ కమిటీ ఆ విభాగంలోకి రాదు" అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X