వైయస్ జగన్ అనుచరులపై త్వరలో చర్యలు: వి హనుమంతరావు
తెలంగాణ విషయంలో కెసిఆర్ కు స్పష్టమైన వైఖరి ఉందో లేదో తనకు తెలియదని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్థం కాదన్నారు. అలాంటి వ్యక్తి గురించి తాను మాట్లాడ దల్చుకోలేదన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఉందని, శ్రీకృష్ణ కమిటి నివేదిక డిసెంబర్ 31న వస్తుందని అప్పుడే దానిపై మాట్లాడగలమని చెప్పారు. మాటిమాటికి తెలంగాణపై సోనియాగాంధీ స్పష్టం చేయాలంటున్న చంద్రబాబు శ్రీకృష్ణ కమిటీ వేసిన విషయం అర్థం చేసుకోవాలన్నారు. సోనియాగాంధీ ఇంటిముందు ధర్నా చేసేముందు చంద్రబాబు మొదట తెలంగాణపై తన అభిప్రాయాన్ని తెలపాలన్నారు. ఆ తర్వాతే సోనియాగాంధీని అడగాలని సూచించారు. కాంగ్రెసు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే సమర్థిస్తామన్న చంద్రబాబు ఆ తర్వాత తెలంగాణపై తన మాట మార్చారని విమర్శించారు. బిజెపి హయాంలో తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు అనుకూలంగా ఉంటాడని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. కెసిఆర్ అయినా, చంద్రబాబు అయినా హస్తాన్ని సవాల్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.