ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నమే అయోధ్యపై తుది తీర్పు
కాగా ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. అయోధ్య విషయంలో అనిశ్చితి కొనసాగటంపై భావ్యం కాదని తాము వాయిదాలు కోరుకోవటం లేదని కోర్టు వెలుపల సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. వివాదం ఎంత త్వరగా సమసిపోతే అంత మంచిదని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక ప్రతిపక్ష భాజపా మంగళవారం(ఈరోజు) సాయంత్రం కోర్ కమిటీ సమావేశం ఏర్పరచనుంది. సమావేశంలో వారు సుప్రీం కోర్టు తీర్పుపై, ఆ తరువాత వచ్చే అలహాబాద్ కోర్టు తీర్పుపై చర్చిస్తారు. తీర్పులు వెలువడిన తర్వాత చేయవలసిన కార్యాచరణపై కూడా చర్చిస్తారు.
కాగా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని అన్ని రాజధానుల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించనున్నారు. తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ప్రత్యేక బలగాలను నియమిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను అప్రమత్తత చేశాయి.సుప్రీం కోర్టు తీర్పుపై అఖిల భారత హిందూ మహాసభ హర్షం వ్యక్తం చేసింది. తీర్పును నాన్చటంలో అర్థం లేదని, ఎంత త్వరగా తీర్పు వెలువడితే అంత మంచిదని వారు పేర్కొన్నారు. తీర్పుపై సున్నీ ముస్లీం లీగ్ పై కూడా ఆనందం వ్యక్తం చేసింది. అయోధ్యపై తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా 144వ సెక్షన్ విధించారు.