డి శ్రీనివాస్ ఎంపిల విందు సమావేశం: తొలి వికెట్ డౌన్
విందు సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు అనంపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన డిఎస్ కు ఓ లేఖ రాశారు. స్థానిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున సమావేశానికి రాలేకపోతున్నానని, పార్లమెంటు సభ్యుల మధ్య సమన్వయం కుదరాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. విందు సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిపై తెలంగాణ పార్లమెంటు సభ్యులు జి వివేక్ నివాసంలో సమావేశమై చర్చించారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పార్టీపరంగా చేపట్టాలని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని తాను మొయిలీకి చెప్పినట్లు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు చెప్పారు. ఈ ప్రతిపాదనకు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అంగీకరించడం సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో సమావేశానికి ఎంత మంది హాజరువుతారనే దాని కన్నా ఎంత మంది డుమ్మా కొడతారనే విషయంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమై ఉంది.