వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పు: నిర్మోహి అఖాడా అంటే ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ayodhya Verdict
లక్నో: అయోధ్య వివాదాస్పద స్థలంపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గురువారం చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలాన్ని కోర్టు మూడు విభాగాలు చేసింది. వాటిలో ఒక భాగాన్ని నిర్మోహి అఖాడాకు కేటాయించింది. మరో రెండు విభాగాల్లో ఒకదాన్ని రాముడి విగ్రహాలకు, మరో భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది. సున్నీ వక్ఫ్ బోర్డు చట్టబద్దమైన సంస్థ. మతపరమైన, చారిటబుల్ ప్రయోజనాలకు చెందిన ఇస్లామ్ ఆస్తుల పరిరక్షణకు ఇది పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు రాష్టంలోని అయోధ్య పట్టణంలోని ఇస్లాం ఆస్తులను కూడా పరిరక్షిస్తుంది. ఈ బోర్డుకు వివాదాస్పద స్థలంలోని మూడో భాగం దక్కింది.

రామ్ లల్లా మసీదు మధ్య 1949లో పెట్టిన హిందు విగ్రహాలకు సంబంధించింది. రామ్ లల్లా రాముడి పసిబాలుడిగా, పిల్లవాడిగా ఉన్నప్పుటి సందర్భాన్ని చెప్పేది. హిందు వ్యాజ్యాలు దీనికి సంబంధించినవే. ఆ విగ్రహాలు అక్కడే ఉండాలని, అక్కడికి వెళ్లేందుకు తమకు అవకాశం ఉండాలని హిందువులు కోరుతున్నారు. ఒక భాగం దీనికి సంబంధించిన స్థలం మరో భాగం నిర్మోహి అఖాడాకు చెందుతుంది. ఇది రాముడి భక్తులకు సంబంధించింది. చెప్పాలంటే, సన్యాసులకు సంబంధించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X