వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ఎన్నికల బరిలోకి గద్దర్: సీమాంధ్రుల మద్దతు?
గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు కత్తి పద్మారావు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గద్దర్ పోరులోకి దిగాలని ఆయన సూచించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) నేత మందకృష్ణ మాదిగ కూడా గద్దర్ కు స్వాగతం చెప్పారు. తనతో కలిసి రావాల్సిందిగా గద్దర్ కెసిఆర్ కు పిలుపునిచ్చారు. కొంత మంది తెలుగుదేశం నాయకులు కూడా గద్దర్ ను స్వాగతించారు. తాము ఎవరికీ పోటీ కాదంటూనే గద్దర్ తగిన భూమికను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎబిఎన్ టీవి చానెల్ ప్రసారం చేసిన కథనం పూర్తిగా గద్దర్ కు అనుకూలంగా ఉంది. అనుకూలంగానే కాదు, కెసిఆర్ పునాదులు కదులుతాయని హెచ్చరించింది. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు వెనక బలమైన శక్తులే ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Sunday, October 3, 2010, 11:09 [IST]