వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎన్నికల బరిలోకి గద్దర్: సీమాంధ్రుల మద్దతు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gaddar
హైదరాబాద్‌: ఎన్నికల రాజకీయాల పట్ల ఇంత కాలం విముఖత ప్రదర్శిస్తూ వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్ తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. తాను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు రాజకీయ రూపం ఇచ్చి ఎన్నికలకు సిద్ధం చేస్తారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యతిరేక శక్తులు గద్దర్ నాయకత్వంలో ఏకం కావడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తొలినాళ్లలో ముందుకు వచ్చిన ప్రజాస్వామిక తెలంగాణ సాధన ఎజెండా మరోసారి ముందుకు వచ్చింది. డిసెంబర్ లోగానే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నిర్ణయించుకుంది. ప్రజాస్వామిక తెలంగాణ సాధనకు గతంలో నాయకత్వం వహించిన ఆకుల భూమయ్య ఇప్పుడు గద్దర్ పక్కన ఉన్నారు.

గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు కత్తి పద్మారావు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గద్దర్ పోరులోకి దిగాలని ఆయన సూచించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) నేత మందకృష్ణ మాదిగ కూడా గద్దర్ కు స్వాగతం చెప్పారు. తనతో కలిసి రావాల్సిందిగా గద్దర్ కెసిఆర్ కు పిలుపునిచ్చారు. కొంత మంది తెలుగుదేశం నాయకులు కూడా గద్దర్ ను స్వాగతించారు. తాము ఎవరికీ పోటీ కాదంటూనే గద్దర్ తగిన భూమికను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఎబిఎన్ టీవి చానెల్ ప్రసారం చేసిన కథనం పూర్తిగా గద్దర్ కు అనుకూలంగా ఉంది. అనుకూలంగానే కాదు, కెసిఆర్ పునాదులు కదులుతాయని హెచ్చరించింది. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు వెనక బలమైన శక్తులే ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X